Sunday 16 October 2016

సూక్ష్మంలో మోక్షం...

సూక్ష్మం లో మోక్షం
ఎవరన్నా అన్నం పెట్టమని అడిగినారంటే మీ అదృష్టం పుచ్చిపోయినట్లే. అంటే పుణ్య కాలం ప్రవేశిస్తున్నది అర్ధం, భగవంతుడు ఎవర్నో అడ్డం పెట్టుకొని వారి ద్వారా మీకు పుణ్య ఫలమును ప్రాప్తి చేస్తున్నాడు అని అర్ధం. దానిని సరిగా మనం వినియోగించుకోవాలి. ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కంటే వేద బ్రాహ్మణుడు, శ్రీవిద్యోపాసకుడు, సన్యాసి, వారి కంటే గోమాత ఇలా ఒక దాని కంటే మరొకటి కోట్ల రెట్లు ఫలమధికము. భా.నా.
నీవు అన్నం పెట్టడం కన్నా వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని చేయి జాచితే అంత కంటే పుణ్యం ఇంకొకటి లేదు. ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చినది నీవు పిలవ కుండానే, వెంటనే దానికి గ్రాసం గాని, అన్నం కాని పెట్ట వలయును. పిలవక పోయినా కాకతాళీయంగా ఒక సన్న్యాసి, ఒక శ్రీవిద్యోపాసకుడు, ఒక భాగవతుడు, ఒక వేదమూర్తి,  నీ ఇంటికి వచ్చాడు కొన్ని కోట్ల జన్మల పాపం తరిగి పోతుంది, నీవు గాని అతనికి ఆతిధ్యం ఇస్తే. కనీసంలో కనీసం కాస్త మంచి తీర్ధం. ఏమో ఏ శంకరాచార్యులు మారు రూపంలో వస్తాడో. యోగులు, జ్ఞానులు, బాబాలు  అన్నం తిని, ఎదుటి వారి పాపాలను తీసుకొని వెళతారు. డబ్బులు తీసుకొని కాదు. తన భక్తుల ఆకలి తీర్చినందులకు భగవంతుడు మిక్కిలి సంతసించి వెంటనే తగు పుణ్యమును మన జమలో వేసేస్తాడు. మన పాప కర్మ తోలిగిపోతుంది.
మహానుభావులకు బుద్ధి ప్రచోదనం చేయిస్తాడు భగవంతుడు నీ కర్మ తొలిగించడానికి. నీ పాప కర్మ తొలిగించడానికి వారు నీ ఇంటికి వెతుక్కొంటూ వస్తారు. నీవు పెట్టె పట్టెడు అన్నంతో నీ జన్మ జన్మల పాపాన్ని అంతా వాళ్ళు తీస్తారు. నీవు పెట్టె పట్టెడు మెతుకుల కోసం వారు రారు. మరలా నీవు రమ్మని బ్రతిమలాడినా రారు. అది ఆ సమయములోనే అంతే. ఒకసారి కాదనుకోన్నావా మరలా తిరిగి రాదు. ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే, నీ పాపాలు అన్నీ తీసుకొని వెళుతుంది నీవు పెట్టిన ఒక్క అరటి పండుతో. జాగ్రత్త.
అమ్మా అన్నం పెట్టు తల్లీ అని అడిగినవానికి లేదనకుండా వున్నది పెట్టు, నీ తరతరాలను ఆశ్వీరదించి వెళతాడు. తిండి దొరకక రారు ఎవ్వరూ నీ ఇంటికి.  కావున తల్లులారా, “అమ్మా అన్నం పెట్టు”... అని అడిగిన వారికి పరిగెత్తుకొని ఎన్ని పనులున్నా మానుకొని పెట్టండి. ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో పంపకండి. వెంటనే మీకు శుభ ఫలితం కనిపిస్తుంది.....భాస్కరానంద నాథ. 17/8/2014.

Thursday 13 October 2016

అభిమంత్రించుట ...

మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తి ర్భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః....

ఈ జగత్తు లోని సమస్త మాతృమూర్తులకు నమస్కరిస్తూ .....

శ్రీ మహా విష్ణువుకు బొడ్డులో నుంచి బ్రహ్మ దేవుడు పుట్టాడు....బ్రహ్మ దేవుడు అంటే సృష్టి ....సమస్త సృష్టి ఆ మహా విష్ణువు లో నుంచి పుట్టినది....ఆడవాళ్లు బిడ్డను కన్నప్పుడు బిడ్డతో బాటు ఓ నరం వస్తుంది....ఆ బొడ్డు కోసి బిడ్డను తల్లిని వేరు చేస్తారు....ఈ పక్రియ ఆడవాళ్లలోనే జరుగుతుంది....గర్భసంచి ఆడవాళ్లలోనే కలదు....మరి విష్ణుమూర్తి స్త్రీ యే కదా....గర్భసంచి వున్నది కదా!

అదుగో ఆ బొడ్డు దగ్గర చేయి పెట్టుకొని విష్ణు సహస్రనామం కాని, లలితా సహస్రనామం కాని చదివితే, అమెరికాలో వుండే మీ పిల్లలకు ఆ పూజా ఫలం చెందుతుంది....మీ బొడ్డు చల్లగా వుంటుంది...అంటే మీ పిల్లలు చల్లగా వుంటారు....కర్పూర హారతి భగవంతుడికి ఇచ్చిన తరువాత మనం కళ్లకు అద్దుకొని, మరలా హారతి బొడ్డుకు అద్దుకోవాలి....భా.నా. పిల్లలు దగ్గర లేరే,.... వాళ్లు దూరంగా వున్నారే.....వాళ్లు పూజలు చేయలేరే అని అనుకోకండి.....మీ బొడ్డు దగ్గర చేయి పెట్టుకొని సంకల్పం చేయండి....పూజ అయిన తరువాత, పరమేశ్వరుడి వదిలిన నీళ్లు, పుష్పం మీ బొడ్డుకు తాకించి భావన చేయండి....అవి మీ బిడ్డ తల మీద అక్షింతలు లాగ పడతాయి....మీ బొడ్డు యే మీ చిరంజీవుల తలలు.....అమ్మ కడుపు చల్లన...అని అంటే అర్ధం ఇదే.......ఈ ప్రయోగం నేను ఎంతమంది చేతనో చేయించాను....భానా..ముఖ్యంగా దూరంగా వుండే పిల్లల కోసం....

అదే పిల్లలు లేని వారు అదే బొడ్డు దగ్గర చేయి పెట్టుకొని 40 రోజులు క్రమం తప్పకుండా లలితా సహస్రనామం చేస్తే పిల్లలు పుడతారు....నిజం.....నేను చెప్పిన తరువాత ఎందరికో అలా పుట్టినారు.

అలాగే భర్త ఊళ్లో లేనప్పుడు గానీ, దూర దేశాలలో వున్న వారి క్షేమం కోసం భార్య తన మాంగళ్యం మీద చేయి వుంచి 40 రోజులు లలితా సహస్రనామం చదివితే తప్పక ఆరోగ్యవంతుడు అవుతాడు...

భర్త కోపతాపాలతో అలిగి వెళ్లినప్పుడు, భర్త యొక్క కండువ గాని, పంచె గాని, చివరకు చేతి గుడ్డ అయినా సరే తీసుకొని తన కుడి ప్రక్కన బొడ్డులో దొపుకొని లలితా సహస్రనామం 40 రోజులు నిష్ఠతో చేస్తే పాతాళంలో వున్నా సరే గుర్రం ఎక్కి పరుగెత్తుకొని వస్తాడు....బొడ్డుకు అంత ప్రాముఖ్యత వున్నది మంత్ర శాస్త్రములో....

గురువులను వీణ మీటినట్లుగా అతి సున్నితంగా కదిలిస్తే ఎన్నో విషయాలు మనకు చెబుతారు...ఓకరు అడిగిన ప్రశ్నకు నా సమాధానము ఇది....
శ్రీమాత్రేనమః......భాస్కరానంద నాథ./10-10-2016